Journalists : ఇజ్రాయెల్ దాడులు.. గాజాలో మరో ఐదుగురు జర్నలిస్టులు మృతి

దిశ, నేషనల్ బ్యూరో : పాలస్తీనాలోని గాజా(Gaza) ప్రాంతంపై ఇజ్రాయెల్(Israel) వైమానిక దాడుల్లో మరో ఐదుగురు జర్నలిస్టులు(Journalists) ప్రాణాలు కోల్పోయారు.

Update: 2024-10-28 14:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో : పాలస్తీనాలోని గాజా(Gaza) ప్రాంతంపై ఇజ్రాయెల్(Israel) వైమానిక దాడుల్లో మరో ఐదుగురు జర్నలిస్టులు(Journalists) ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు గాజాలో చనిపోయిన జర్నలిస్టుల సంఖ్య 53కు పెరిగింది. జర్నలిస్టుల మృతిపై ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ విచక్షణారహిత దాడుల వల్ల గాజాలో తీవ్ర ప్రాణనష్టం జరుగుతోందన్నారు. మరోవైపు గాజాలోని జబాలియా శరణార్ధి శిబిరం పరిసరాల్లో ఆయుధాల నిల్వలను ఇటీవలే ఇజ్రాయెల్ ఆర్మీ గుర్తించింది. దీంతో ఆ ప్రాంతాలపై దాడులను కొనసాగిస్తోంది.

Tags:    

Similar News