జమ్మూ కశ్మీర్‌లో ఎన్ కౌంటర్: ఓ ఉగ్రవాది హతం

జమ్మూలోని కథువా జిల్లా హీరానగర్‌లోని సైదా సోహల్ ప్రాంతంలో మంగళవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.

Update: 2024-06-11 17:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూలోని కథువా జిల్లా హీరానగర్‌లోని సైదా సోహల్ ప్రాంతంలో మంగళవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపిన వివరాల ప్రకారం..అంతర్జాతీయ సరిహద్దుకి సమీపంలోని హీరానగర్ సెక్టార్‌ కతువాలోని సైదా గ్రామంలో ఓ ఇంటిపై ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో అప్రమ్తమైన భద్రతా బలగాలు గ్రామానికి చేరుకుని టెర్రరిస్టులపైకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే ఓ ఉగ్రవాది మృతి చెందాడు. ఈ కాల్పుల్లో ఓ సాధారణ పౌరుడు కూడా గాయపడ్డట్టు తెలుస్తోంది. గ్రామంలో ఇతర ఉగ్రవాదులు దాడి ఉన్నారన్ని సమాచారం మేరకు కశ్మీర్ పోలీసులు, పారా మిలటరీ బలగాలు సంయుక్తంగా ఘటనా ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు మంత్రి తెలిపారు. అక్కడి పరిణామాలను నిరంతరం గమనిస్తున్నట్టు వెల్లడించారు. కాగా, మూడు రోజుల్లోనే జమ్మూలో ఇది రెండో దాడి కావడం గమనార్హం. అంతకుముందు యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయగా..తొమ్మిది మంది మరణించగా..33మంది గాయపడ్డారు.


Similar News