Earthquake: హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం.. భయాందోళనలో జనం
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో భూమి కంపించింది. స్వల్ప భూకంపంతో (Earthquake) ప్రజలు భయాందోళన చెందారు.
దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో భూమి కంపించింది. స్వల్ప భూకంపంతో (Earthquake) ప్రజలు భయాందోళన చెందారు. మంగళవారం మధ్యాహ్నం మండి (Mandi) జిల్లాలో భూమి కంపించింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology) వెల్లడించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.3గా నమోదైనట్లు వెల్లడించింది. కులు – మండి మధ్య కొండ ప్రాంతంలో భూమి కంపించినట్లు తెలిపింది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, స్వల్ప స్థాయిలోనే భూ ప్రకంపనలు ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం వంటివి సంభవించలేదు. మరోవైపు భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు.