Delhi AIIMS: ఢిల్లీలో వరదల ధాటికి ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన నీరు.. రోగులకు తీవ్ర ఇబ్బందులు

ఢిల్లీ నగరంలో రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-06-29 09:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ నగరంలో రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు మళ్లీ మొదలైన వాన ఏకధాటిగా 3 గంటలకు పైగా కురిసింది. దీంతో ఢిల్లీ నగరంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చాలా ప్రాంతాల్లోన్ని ఇండ్లల్లోకి నీరు చేరి.. జనాలు ఇబ్బంది పడుతున్నారు. వాహానాలన్నీ నీట మునిగాయి. తాజాగా ఢిల్లీలోని వరదల ధాటికి ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన నీరు జమ అయింది. ఆసుపత్రిలోకి భారీగా వరద చేరడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి లిఫ్ట్ పై నుంచి నీరు కారుతుంది. పార్కింగ్ ఏరియాతో పాటు ఆసుపత్రి గదులలో కూడా వరద నీరు చేరింది. ఢిల్లీలో 24 గంటల్లోనే 228. 1 ఎంఎం వర్షపతం నమోదయ్యిందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

Similar News