న్యూఢిల్లీ : కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ మధ్య పొత్తు చిగురించే దిశగా అడుగులు ముందుకుపడ్డాయి. జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన తనయుడు కుమారస్వామి గురువారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో భేటీ అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో జేడీఎస్, బీజేపీ మధ్య సీట్ల కేటాయింపుపై చర్చించినట్లు తెలుస్తోంది. శుక్రవారం రోజున ప్రధాని మోడీతో దేవెగౌడ, కుమారస్వామి భేటీ అవుతారని సమాచారం. ఆ మీటింగ్ తర్వాత ఎన్డీయేలోకి జేడీఎస్ చేరికపై దేవెగౌడ ప్రకటన చేసే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతోంది.