కోల్‌కతా ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం చేసింది ఇతడే

కోల్‌కతాలోని ఆర్జీ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-14 14:50 GMT

దిశ, వెబ్ డెస్క్ : కోల్‌కతాలోని ఆర్జీ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఆమెపై దారుణానికి ఒడిగట్టిన నిందితున్ని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. ఇప్పటి వరకు ఆ నిందితుడి సమాచారం బయటికి రాలేదు. అయితే పశ్చిమ బెంగాల్ లోని మీడియా వెల్లడి చేసిన కథనాల ప్రకారం.. నేరస్తుడు బీహార్ రాష్ట్రానికి చెందిన సంజయ్ రాయ్. ఇతడు కోల్‌కతాలో పోలీసు విభాగంలో పౌర వాలంటీరుగా పని చేస్తున్నాడు. 2022 లో గర్భవతి అయిన భార్యపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాడని స్థానిక పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పలువురు మహిళల నంబర్లు తీసుకొని వేధించాడనే ఆరోపణలు కూడ ఉన్నట్టు సమాచారం.  


Similar News