cm vijayan: మోడీతో కేరళ సీఎం విజయన్ భేటీ.. వయనాడ్ పునరావాస ప్రణాళికపై చర్చ

ప్రధాని నరేంద్ర మోడీతో మంగళవారం కేరళ సీఎం పినరయి విజయన్ భేటీ అయ్యారు. వయనాడ్ పునరావాస ప్రణాళికపై చర్చించారు. ఈ మేరకు కేరళ సీఎంఓ ప్రకటన విడుదల చేసింది.

Update: 2024-08-27 16:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీతో మంగళవారం కేరళ సీఎం పినరయి విజయన్ భేటీ అయ్యారు. వయనాడ్ పునరావాస ప్రణాళికపై చర్చించారు. ఈ మేరకు కేరళ సీఎంఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్రం కోరిన అదనపు వివరణాత్మక మెమోరాండం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మోడీకి అందజేశారు. విషాద ఘటనలో ఇళ్లు కోల్పోయిన వారి కోసం టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేయడం, బాధిత వ్యక్తులకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై విజయన్ ప్రధానికి తెలియజేసినట్టు సమాచారం.

కాగా, కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో 308 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు భారీగా ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే. మరోవైపు ఆగష్టు 10న వయనాడ్‌లోని విపత్తు ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మోడీ, అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఘటన వల్ల జరిగిన నష్టంపై వివరణాత్మక మెమోరాండం సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో సీఎం విజయన్ మోడీతో సమావేశమయ్యారు.


Similar News