Budget 2024: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణకు రూ.15 వేల కోట్లు

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

Update: 2024-07-23 06:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం ప్రకటించారు. అవసరమైతే అమరావతికి మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. పోలవరం పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించారు. విశాఖ- చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్‌- బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు ఇచ్చారు.


Similar News