BREAKING: పాట్నా-జార్ఖండ్ ప్యాసింజర్‌ ట్రైన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన బోగీలు

పాట్నా- జార్ఖండ్‌ ప్యాసింజర్‌ రైల్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2024-06-06 16:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాట్నా- జార్ఖండ్‌ ప్యాసింజర్‌ రైల్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బీహార్‌ రాష్ట్రంలోని లఖిసరాయ్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, రైల్వే స్టేషన్‌‌లో ట్రైన్ అగిన వెంటనే భోగిల్లో మంటలు చెలరేగాయి. దీంతో మొత్తం రెండు బోగీలు కాలాబూడిదయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థాలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం తేలియరాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే ఉన్నతాధికారులు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై సమీక్ష చేపడుతున్నారు. రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.


Similar News