Kashmir Polls : కశ్మీర్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుంది : రాంమాధవ్
దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ ఆవిర్భవిస్తుందని ఆ పార్టీ ఎన్నికల ఇంఛార్జి, ఆర్ఎస్ఎస్ నేత రాంమాధవ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ ఆవిర్భవిస్తుందని ఆ పార్టీ ఎన్నికల ఇంఛార్జి, ఆర్ఎస్ఎస్ నేత రాంమాధవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా గురువారం నౌషేరా అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈసందర్భంగా ఆయనతో పాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి రాంమాధవ్ కూడా వెళ్లారు.
రవీందర్ రైనా భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘జమ్మూకశ్మీర్ రాజవంశీకులను అవమానించేలా రాహుల్ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. కశ్మీర్ ప్రజలు ఈ ఎన్నికల్లో వారికి తగిన సమాధానం ఇస్తారు’’ అని రవీందర్ రైనా పేర్కొన్నారు.