Baba Siddique : ఆ సింహం రక్తం నా నరాల్లో ప్రవహిస్తోంది.. బాబా సిద్దిఖీ కుమారుడి ఎమోషనల్ పోస్ట్

దిశ, నేషనల్ బ్యూరో : ముంబైలో దారుణ హత్యకు గురైన ఎన్‌సీపీ నేత బాబా సిద్దిఖీ కుమారుడు జీషాన్ సిద్దిఖీ ‘ఎక్స్’ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

Update: 2024-10-20 13:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ముంబైలో దారుణ హత్యకు గురైన ఎన్‌సీపీ నేత బాబా సిద్దిఖీ కుమారుడు జీషాన్ సిద్దిఖీ ‘ఎక్స్’ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ.. ‘‘పోరాటం ఇంకా ముగియలేదు. ఆ సింహం రక్తం ఇంకా నా నరాల్లో ప్రవహిస్తూనే ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘నేను ఇంకా బతికే ఉన్నాను. అలుపెరగకుండా పోరాటం చేస్తూనే ఉంటాను’’ అని జీషాన్ సిద్దిఖీ స్పష్టం చేశారు.

‘‘వాళ్లు మా నాన్న గొంతు మూగబోయేలా చేశారు. అయితేనేం ఆయన ఓ సింహం. మా నాన్న గర్జనను ఇక నేను వినిపిస్తాను. ఆయన పోరాటతత్వం నా నరనరాల్లో సజీవంగా ఉంది. ఆయన న్యాయం పక్షాన నిలబడ్డారు. మార్పు కోసం పోరాడారు. అనేక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆయన్ను కడతేర్చి గెలిచామని వాళ్లు అనుకుంటున్నారు. ఒకటి గుర్తుంచుకోండి. నేను వస్తున్నా’’ అని జీషాన్ తెలిపారు. తాను ధైర్యాన్ని కోల్పోలేదని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.


Similar News