Breaking news : ఇండియన్ ఆర్మీలో విషాదం.. నలుగురు జవాన్లు మృతి

ఇండియన్ ఆర్మీలో విషాదం చోటు చేసుకుంది.

Update: 2024-09-05 10:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియన్ ఆర్మీలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నలుగురు ఆర్మీ సిబ్బంది మృతి చెందారు. పశ్చిమ బెంగాల్ లోని పెడాంగ్ నుంచి సిక్కింలోని ప్యాక్ యాంగ్ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్‌కు చెందిన డ్రైవర్ ప్రదీప్ పటేల్, మణిపూర్‌కు చెందిన క్రాఫ్ట్‌మ్యాన్ డబ్ల్యు. పీటర్, హర్యానాకు చెందిన నాయక్ గుర్సేవ్ సింగ్, తమిళనాడుకు చెందిన సుబేదార్ కె.తంగపాండి ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారంతా పశ్చిమ బెంగాల్‌లోని బినాగురికి చెందిన యూనిట్‌కు చెందినవారని భారత ఆర్మీ అధికారులు తెలిపారు.


Similar News