Steel Plant Mishap : స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. ఇద్దరి మృతి, ఐదుగురు విషమం

దిశ, నేషనల్ బ్యూరో : ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లా బుధిపడార్‌లో ఉన్న ఒరిస్సా మెటాలిక్స్ స్టీల్ ప్లాంటులో ప్రమాదం సంభవించింది.

Update: 2024-09-18 14:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లా బుధిపడార్‌లో ఉన్న ఒరిస్సా మెటాలిక్స్ స్టీల్ ప్లాంటులో ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం 11 గంటలకు అకస్మాత్తుగా మెటల్ ప్లేట్ విరిగి పడటంతో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలవగా, వారి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన కార్మికులను 34 ఏళ్ల పూర్ణచంద్ర జెనా (ఒడిశా), 39 ఏళ్ల అలేక్ దేవ్ సాహూ‌ (జార్ఖండ్)గా గుర్తించారు. ఈ ఘటనను నిరసిస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని శాంతింపజేసి ఆందోళన విరమింపజేశారు.


Similar News