ఐఎన్ఎస్ విక్రాంత్లో నావికుడి సూసైడ్..
కేరళలోని కోచి తీరంలో ఉన్న విమాన వాహకనౌక ఐఎన్ఎస్ విక్రాంత్లో 19 ఏళ్ల వయసున్న నావికుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
కోచి : కేరళలోని కోచి తీరంలో ఉన్న విమాన వాహకనౌక ఐఎన్ఎస్ విక్రాంత్లో 19 ఏళ్ల వయసున్న నావికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం తెల్లవారుజామున అతడు సీలింగ్కు వేలాడుతూ విగతజీవిగా కన్పించాడని రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మృతుడు బిహార్లోని ముజఫర్పూర్కు చెందిన వ్యక్తి అని వెల్లడించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. దీనిపై స్థానిక పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు రక్షణ శాఖ పేర్కొంది. కాగా, నౌకాదళంలో గతంలోనూ ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. ఒత్తిడి, ఇతరత్రా కారణాలతో పలువురు బలవన్మరణానికి పాల్పడ్డారు.