తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ని కలిసిన జానీ మాస్టర్ బాధితురాలు

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny master) పై ఓ మహిళా డ్యాన్సర్ లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-09-18 15:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny master) పై ఓ మహిళా డ్యాన్సర్ లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ (Johnny master) తనను లైంగికంగా వేదించాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను విచారించారు. అనంతరం బుధవారం జానీ మాస్టర్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా ప్రస్తుతం ఆయన పరారీలో ఉండగా.. లడఖ్‌లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. మహిళా సంఘాలతో కలిసి తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ని జానీ మాస్టర్ బాధితురాలు కలిసింది. అవకాశాలు ఇవ్వడం కోసం జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.

Read More : జానీ మాస్టర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు


Similar News