బాలీవుడ్‌లో బిజీగా కీర్తిసురేష్‌.. మరి టాలీవుడ్ పరిస్థితి ఏంటి?

ఇటీవల రఘుతాత చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ప్రముఖ కథానాయిక కీర్తి సురేష్‌ ప్రస్తుతం తెలుగులో నటిస్తున్న సినిమా ఏది సెట్స్‌ మీద లేదు.

Update: 2024-09-19 15:42 GMT

దిశ, సినిమా: ఇటీవల రఘుతాత చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ప్రముఖ కథానాయిక కీర్తి సురేష్‌ ప్రస్తుతం తెలుగులో నటిస్తున్న సినిమా ఏది సెట్స్‌ మీద లేదు. ఒకప్పుడు తెలుగులో కూడా చేతినిండా సినిమాలతో బిజీగా వున్న కీర్తికి వరుస ఫ్లాపులు రావడంతో టాలీవుడ్‌లో కాస్త జోరు తగ్గింది. ఇక 'మహానటి' చిత్రంలో ఉత్తమ నటనకు జాతీయ పురస్కారం అందుకున్న ఈ బ్యూటీ హవా ఇప్పుడు బాలీవుడ్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుణ్‌ ధావన్‌ సరసన బేబీ జాన్‌ అనే సినిమాలో నటిస్తుంది కీర్తిసురేష్‌.

ఈ చిత్రానికి జవాన్‌ దర్శకుడు, కీర్తి సురేష్‌ స్నేహితుడు అట్లీ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తమిళంలో తెరకెక్కిన తేరీ చిత్రానికి రీమేక్‌గా బేబీ జాన్‌ రాబోతుంది. డిసెంబరులో ఈ చిత్రం విడుదల కానుందని తెలిసింది. ఈ చిత్రంతో పాటు బాలీవుడ్‌లో కీర్తి సురేష్‌ మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నటించున్నారని సమాచారం. అట్లీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ మల్టీస్టారర్‌ చిత్రంలో బాలీవుడ్‌లోని ఇద్దరు టాప్‌హీరోలు కథానాయకులుగా నటిస్తారట. స్క్రీప్ట్‌ వర్క్‌ కూడా పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్‌ ఉంటారని, అందులో ఒక హీరోయిన్‌గా అట్లీ కీర్తి సురేష్‌ని ఎంపిక చేశారని బాలీవుడ్‌ వర్గాల సమాచారం.


Similar News