అరియానాతో రాజ్ తరుణ్ ఎఫైర్.. మరో బాంబు పేల్చిన లావణ్య

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2024-07-08 14:33 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజ్ తరుణ్ తనతో ప్రేమాయణం నటిపి పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో.. ఈ విషయం బయటకు వచ్చి సంచలనం సృష్టిస్తుంది. అయితే.. ఈ ఇష్యూపై ఇప్పటికే స్పందించిన హీరో.. ‘ఆమె నేను రిలేషన్‌లో ఉన్న విషయం నిజమే. కానీ ఆమె డ్రగ్స్‌కు అలవాటు పడింది. అలాగే మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉంది. ఇప్పుడు నా ఫేమ్ చెడగొట్టడానికే ఇలా చేస్తుంది’ అని చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు లావణ్యకు రివర్స్‌లో నోటీసులు జారీ చేశారు. తర్వాత లావణ్య పారిపోయింది.

అయితే.. తాజాగా మీడియా ముందుకు వచ్చిన లావణ్య మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. రాజ్ తరుణ్‌కు చాలా మందితో ఎఫైర్స్ ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. ఈ మేరకు ‘రాజ్ తరుణ్ అరియానాతో కూడా ఎఫైర్ పెట్టుకున్నాడు. అరియానా గ్లోరీతో ఒక్కరోజు మాత్రమే షూటింగ్‌కి వెళ్లాడు. ఆ టైంలో నేను కోర్స్ నేర్చుకోవడానికి మూడు నెలలు గోవా వెళ్లాను. అప్పుడు తరుణ్ అరియానాకు దగ్గరయ్యాడు. నేను వెళ్లిన నెలరోజులకు రాజ్ తరుణ్, అరియానా కలవడం మొదలు పెట్టారు. ఈ విషయం నాకు రాజ్ తరుణ్ మేనేజర్, నటుడు రాజా రవీంద్ర ఫోన్ చేసి చెప్పారు.. లేకపోతే ఈ ఇద్దరి యవ్వారం నాకు తెలిసేది కాదు’ అని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో మరోసారి వీరి వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. 


Similar News