25 రోజులు మాత్రమే.. పవన్ కల్యాణ్ సినిమాపై నిర్మాత క్రేజీ అప్‌డేట్

పవన్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.

Update: 2024-06-29 10:13 GMT

దిశ, సినిమా: పవన్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్.. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక.. రాజకీయాలతో పాటు.. ఆయన ఒప్పుకున్న సినిమాలు కూడా పూర్తి చేసే పనిలో పడ్డారట పవన్ కల్యాణ్. ఈయన ఒప్పుకున్న సినిమాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. ఈ మూవీ అనౌన్స్ చేసి సంవత్సరాలు గడుస్తు్న్న దీనిపై ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో మూవీ ఆపేసినట్లు నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే సినిమాపై క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు నిర్మాత ఎ.ఎం రత్నం.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత ఎ.ఎం రత్నం మాట్లాడుతూ.. ‘‘హరిహర వీరమల్లు’లో పవన్ కల్యాణ్‌ షూటింగ్‌ చాలావరకూ పూర్తయింది. ఇంకో 20 నుంచి 25 రోజులు ఆయన షూటింగ్‌ చేస్తే మూవీ పూర్తవుతుంది. అది కూడా ఆయన వీలునుబట్టి త్వరలోనే పూర్తి చేసే ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ సొంతం చేసుకుంది. వారి అగ్రిమెంట్‌ ప్రకారం సినిమా అక్టోబర్‌లో విడుదల కావాలి. కానీ వాళ్లని రిక్వెస్ట్‌ చేసి విడుదల కాస్త వెనక్కి తీసుకెళ్తాం. ఈ ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాము.. మాక్సిమమ్ డిసెంబర్‌లో రిలీజ్ చేస్ విధంగా చూస్తాము’ అంటూ పలు విషయాలు పంచుకున్నారు.

కాగా.. ‘ధర్మం కోసం యుద్ధం’ అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. ఇప్పుడు ఆయన బిజీ ఉండటంతో క్రిష్ పర్యవేక్షణలో జ్యోతి కృష్ణ పూర్తి చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య మూవీస్ పతాకంపై ఎ.ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్రలో అలరించనున్నాడు. 

Similar News