కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన నిత్య.. హిట్ కాంబో రిపీట్ అంటున్న నెటిజన్లు!
ఒక సినిమా హిట్ అయింది అంటే.. అందులో హీరో, హీరోయిన్ల పాత్ర సమానంగా ఉంటోంది.
దిశ, సినిమా: ఒక సినిమా హిట్ అయింది అంటే.. అందులో హీరో, హీరోయిన్ల పాత్ర సమానంగా ఉంటోంది. దీంతో మరోసారి ఆ జంట జతకడితే సినిమాపై వేరే లెవర్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొంటాయి. అలాంటి ఓ హిట్ కాంబోనే ఇప్పుడు మరోసారి రిపీట్ అవుతోంది. కోలివుడ్ స్టార్ హీరో ధనుష్, క్యూట్ బ్యూటీ నిత్య మీనన్ జంటగా నటించిన చిత్రం ‘తిరుచిత్రాంబళం’. డైరెక్టర్ మిత్రన్ ఆర్.జవహర్ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్కడంతో సూపర్ హిట్గా నిలిచింది. అంతే కాకుండా.. ఈ సినిమాలోని తన నటనకు గానూ ఇటీవలే ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సైతం అందుకుంది నిత్య మీనన్. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్య.. తన కొత్త సినిమాపై అనౌన్స్మెంట్ ఇచ్చింది.
‘దీని గురించి నేను ఇప్పుడే అధికారికంగా ప్రకటించలేను. కానీ.. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న మూవీ ఇది. ‘తిరుచిత్రాంబళం’లోని శోభిత పాత్ర మాదిరిగానే.. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా, సవాలుగా ఉంటుంది. ఈ సినిమాలో భాగమైనందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ నిత్య మీనన్ కామెంట్స్ వైరల్ అవుతుంటే.. ‘తిరు’ చిత్రంలోతన క్యారెక్టర్ గురించి ప్రస్తావించడంతో.. మరోసారి ధనుష్తో మూవీ చేస్తుందని అనుకుంటూ.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు అంతే కాకుండా సూపర్ కాంబో మరోసారి రిపీట్ కాబోతున్నట్లు వార్తలు రావడంతో.. అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఈగర్గా ఎదురుచూస్తున్నారు.