బాధితురాలికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్న.. జానీ మాస్టర్ వివాదంపై స్టార్ యాంకర్

టాలీవుడ్‌లో స్టార్ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ ప్రజెంట్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-09-18 15:18 GMT

దిశ, సినిమా: టాలీవుడ్‌లో స్టార్ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ ప్రజెంట్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదులో.. జానీ మాస్టర్ తనను కోరిక తీర్చాలని వేధించినట్లు, కోరిక తీర్చకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని, తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ ఒత్తిడి చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ ఇష్యూ టాలీవుడ్‌లో దుమ్ము దుమారం రేపుతోంది. దీనిపై ఇప్పటికే తెలుగు ఫిలిం చాంబర్ అధికారికంగా స్పందించింది. అలాగే కొంతమంది సెలబ్రెటీలు సైతం దీనిపై స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా స్టార్ యాంకర్ అనసూయ సైతం స్పందిస్తూ.. ఇన్‌స్టా వేదికగా స్టోరీ పెట్టింది.

‘జరుగుతున్న విషయాలపై మహిళలకు సానుభూతి అవసరం లేదు. అన్యాయ్యాన్ని ప్రశ్నించే తత్వం ఉండాలి. మీకే కాదు తెలిసిన వాళ్లకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే వెంటనే బయటపెట్టండి. మీకు అందరూ అండగా ఉంటారు. బాధితురాలితో నేను కూడా కలిసి పని చేశాను. పుష్ప సెట్స్‌లో రెండు మూడు సార్లు ఆ అమ్మాయిని చూశాను. తను చాలా టాలెంటెడ్. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఆ అమ్మాయి టాలెంట్‌ను ఏ మాత్రం తగ్గించలేవు. కానీ, మనసులో దాచుకొని బాధపడటం వల్ల ఎలాంటి లాభం లేదు. నేను పనిచేసే చోట మహిళలకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందిస్తాను. ఈ వ్యవహారంలో కూడా బాధితురాలికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. ఇందుకోసం సపోర్టుగా ఉన్న ఫిలిం చాంబర్‌తో పాటు ఓడబ్ల్యు సభ్యులకు కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో ఏ మహిళకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ అనసూయ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. 

Read more : Jani Master Sexual Assault Case :జానీ మాస్టర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు


Similar News