లైట్ వెయిట్ శారీలో నయనతార అందాలు.. ఇండియా గెలిచింది కప్పు.. నీ గుండెల్లో చోటివ్వు అప్పు అంటున్న నెటిజన్లు

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘లక్ష్మి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.

Update: 2024-06-30 09:09 GMT

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘లక్ష్మి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఈమె తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, వంటి భాషల్లో నటించి తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది. వరుస సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ మూవీలు చేస్తూ స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సరోగసి ద్వారా ఇద్దరు బాబులకు తల్లి అయింది. ప్రస్తుతం ఓ పక్కా సినిమాలు మరోపక్కా ఫ్యామిలీతో లైఫ్‌ని బిజీబిజీగా గడుపుతోంది. అంతేకాక సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ అన్ని విషయాలను షేర్ చేస్తూ అభిమానులకి దగ్గరవుతూ ఉంది.

తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ లైట్ వెయిట్ శారీ కట్టుకొని ఫోటోలకి ఫోజులిచ్చింది. అది చూసిన నెటిజన్లు ఇండియా గెలిచింది కప్పు.. నీ గుండెల్లో ఇవ్వు అప్పు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.

Similar News