తెలుగులో మరో ఆఫర్ అందుకున్న ‘కేజీఎఫ్’ హీరోయిన్! హీరో ఎవరంటే?
హీరోయిన్ శ్రీనిధి శెట్టి ‘కేజీఎఫ్’ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
దిశ, సినిమా: హీరోయిన్ శ్రీనిధి శెట్టి ‘కేజీఎఫ్’ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి చిత్రంతోనే తన నటన, అందం, యాటిట్యూడ్తో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఈ మేరకు ప్రజెంట్ తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డతో ‘తెలుసు కదా’ అనే మూవీలో చేస్తున్న ఈ బ్యూటీ.. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ ‘వేట్టయాన్’లో కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక వీటితో పాటు.. తేజ దర్శకత్వంలో వస్తున్న ‘రాక్షస రాజ్యం’ చిత్రం చేయనున్నట్లు తెలుస్తుంది.
ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి తెలుగులో మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. కొత్త దర్శకుడు కిశోర్ తెరకెక్కిస్తున్న ఓ మూవీలో దగ్గుబాటి రానా హీరో కాగా.. ఇందులో హీరోయిన్గా శ్రీనిధి శెట్టి ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్.