ఎనిమిదేళ్లు గడిచినా సమాజంలో ఎలాంటి మార్పు రాలేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

అమితాబ్ బచ్చన్, తాప్సీ, కృతి కుల్హరి, విజయ్ వర్మ తదితరులు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘పింక్’.

Update: 2024-09-16 16:10 GMT

దిశ, సినిమా: అమితాబ్ బచ్చన్, తాప్సీ, కృతి కుల్హరి, విజయ్ వర్మ తదితరులు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘పింక్’. మహిళలకు ఎదురవుతున్న సంఘటలన్ని, వాళ్ల విషయంలో సమాజం తీరును ఎత్తి చూపేలా తెరకెక్కిన ఈ బాలీవుడ్ చిత్రం విడుదలై నేటికి 8 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా తాప్సీ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘ఇండియన్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ చిత్రాల జాబితాలో మా ‘పింక్’ నిలుస్తుందని అప్పుడు మేం అనుకోలేదు. అయితే.. ఎనిమిదేళ్లు గడిచినా సమాజంలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ మహిళలకు సేప్టీ లేదు. ఈ చిత్రంలో భాగమైనందుకు గర్వంగా ఫీలయ్యే వారికి అదో బాధ’ అని చెప్పుకొచ్చింది.


Similar News