‘కమిటీ కుర్రోళ్లు’ ట్రైలర్ రిలీజ్.. తొలి చిత్రంతోనే మెగా డాటర్ హిట్ కొట్టేనా?

విలేజ్ బ్యాక్ డ్రాప్‌ నేపథ్యంలో సాగే ‘కమిటీ కుర్రోళ్లు’ ట్రైలర్ తాజాగా విడుదలైంది.

Update: 2024-07-27 02:13 GMT

దిశ, సినిమా: విలేజ్ బ్యాక్ డ్రాప్‌ నేపథ్యంలో సాగే ‘కమిటీ కుర్రోళ్లు’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న ఈ చిత్ర ట్రైలర్ ఈవెంట్ శుక్రవారం నిర్వహించారు. ఇది చూస్తుంటే కుర్రాళ్ల మధ్య కులాలు, మతాలు తెచ్చే గొడవలు, ప్రేమలు, ఆటలు, రాజకీయాలు, ఎమోషనల్‌గా మార్చే సన్నివేశాలు.. పెద్దాయ్యాక ఇవన్నీ బెస్ట్ మెమోరీస్ గా నిలిచిపోయే సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. స్నేహం కంటే కులమతాలకే ఎక్కువగా విలువనిస్తారా? లేక ఫ్రెండ్షిప్‌కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారా?

కులాలతో విడిపోయిన వారి మనసుల్లో సంఘర్ణణ ఎలా ఉంటుంది? లాస్ట్‌కి అందరూ కలుస్తారా? లేదా? అని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. యదు వంశీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక ఈవెంట్‌కు సిద్ధు జొన్నలగడ్డ హాజరై.. నిహారిక కొణిదెలపై కామెంట్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. మల్లిటాలెంట్ అంటూ కొనియాడారు. ఈ సినిమా ఆగస్టు 9 వ తారీకున థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.


Similar News