డయాబెటిస్ పేషెంట్లకు శుభవార్త.. ఈ బియ్యంతో షుగర్ కంట్రోల్..

ప్రపంచవ్యాప్తంగా 537 మిలియన్లకు పైగా పెద్దలు మధుమేహంతో బాధపడుతున్నారు. 2045 నాటికి ఈ సంఖ్య 783 మిలియన్లకు పెరిగే అవకాశం ఉంది. అధిక బరువు, జీన్స్ వంటి అంశాలు ఈ దీర్ఘకాలిక వ్యాధికి కారణం అవుతుండగా... ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయడంలో విఫలమైనప్పుడు టైప్ 2 డయాబెటిస్ వస్తుంది.

Update: 2024-09-26 17:31 GMT

దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా 537 మిలియన్లకు పైగా పెద్దలు మధుమేహంతో బాధపడుతున్నారు. 2045 నాటికి ఈ సంఖ్య 783 మిలియన్లకు పెరిగే అవకాశం ఉంది. అధిక బరువు, జీన్స్ వంటి అంశాలు ఈ దీర్ఘకాలిక వ్యాధికి కారణం అవుతుండగా... ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయడంలో విఫలమైనప్పుడు టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. కణాలు ఇన్సులిన్‌కు నిరోధకతను అభివృద్ధి చేస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. గ్లైసెమిక్ ఇండెక్స్(GI)అధికంగా ఉంటే డయాబెటిస్ వస్తుండగా.. దీన్ని అదుపు చేసేందుకు 45 కంటే తక్కువ జీఐ ఉన్న వరి రకాన్ని అభివృద్ధి చేశారు అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు.

ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ లక్షణాలతో కూడిన ఈ బియ్యం డయాబెటిక్, ప్రీడయాబెటిక్ ఉన్నవారికి వరంగా మారనుంది. మధుమేహాన్ని కంట్రోల్ చేయనుంది. కాగా సాధారణ బియ్యం రకాలను తక్కువ జీఐ బియ్యంగా మార్చడం ద్వారా దీన్ని డెవలప్ చేశారు. ఐఆర్‌ఆర్‌ఐ ఇప్పటికే ఫిలిప్పీన్స్‌లో IRRI 125, IRRI 147 అనే రెండు తక్కువ-జీఐ వరి రకాలను విడుదల చేసింది. బియ్యం ప్రధానమైన దేశాల్లో పేదరికం, ఆకలిని ఎదుర్కోవడానికి ఐఆర్‌ఆర్‌ఐ రెమిట్‌లో భాగంగా భారతదేశం, ఫిలిప్పీన్స్‌లో దీనిని పెంచడం ప్రారంభించాలని యోచిస్తున్నట్లు చెప్పారు శాస్త్రవేత్తలు. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో బియ్యం తినే దేశాలలో ఈ బియ్యం పెద్ద ప్రభావాన్ని చూపుతుందని అభిప్రాయ పడ్డారు.

Tags:    

Similar News