పర్పుల్ కలర్ లెహంగాలో రాధికా మర్చంట్.. ఏంజిల్‌లా ఉన్నావంటున్న నెటిజన్స్

ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుక శుక్రవారం అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, సినీ తారలు, రాజకీయ ప్రముఖులు అటెండ్ అయ్యారు.

Update: 2024-07-13 07:40 GMT

దిశ, ఫీచర్స్: ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుక శుక్రవారం అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, సినీ తారలు, రాజకీయ ప్రముఖులు అటెండ్ అయ్యారు. మన బాలీవుడ్, టాలీవుడ్ తారలు కూడా సందడి చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఇకపోతే ప్రజెంట్ సోషల్ మీడియా మొత్తం ఈ వివాహ వేడుకల గురించి డిస్కషన్ నడుస్తోంది. అక్కడికి వచ్చిన సెలబ్రిటీలు, వారు ధరించిన దుస్తులు, ముఖ్యంగా వధూ వరులు వేసుకున్న డ్రెస్సులు, వధువు ఒంటిపై నగల గురించి కొందరు క్యూరియాసిటీ ప్రదర్శిస్తున్నారు.

ముఖ్యంగా రాధికా మర్చంట్ ‘గార్బా నైట్’ సందర్భంగా ధరించిన పర్పుల్ కలర్ లెహంగా ఫొటోస్ వైరల్ అవుతుండగా దేవకన్యలా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. కాగా ఈ లెహంగాను ప్రముఖ డిజైనర్ జిగ్యా పటేల్ రూపొందించారు. సిల్వర్ సీక్విన్స్‌తో చేసిన ఎంబ్రాయిడరీతో పాటు లెహంగాపై ఉన్న ప్యాట్రన్స్, బోల్డ్ లుక్‌ బార్డర్స్ బాగా ఆకట్టుకున్నాయి. రాధిక స్కిన్ కలర్‌కు, పర్పుల్ లెహంగాకు మస్తు సెట్ అయిందని పలువురు పేర్కొంటున్నారు.

Full View

Tags:    

Similar News