మహేశ్, సుకుమార్ చర్చలు.. అందుకేనా?

దిశ, వెబ్‌డెస్క్ : సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కార్ వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నారు. పరశురాం డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కానుండగా.. ప్రిన్స్ తన తర్వాతి సినిమా కోసం డైరెక్టర్ సుకుమార్‌తో చర్చలు జరుపుతున్నారని టాక్. గతంలో ‘వన్ నేనొక్కడినే’ కోసం వీరిద్దరూ కలిసి పనిచేయగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో నిరాశపడ్డారు. తమ కాంబినేషన్‌పై ఫ్యూచర్‌లో మరో సినిమా చేయాలని భావించినా, క్రియేటివ్ […]

Update: 2020-12-01 08:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కార్ వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నారు. పరశురాం డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కానుండగా.. ప్రిన్స్ తన తర్వాతి సినిమా కోసం డైరెక్టర్ సుకుమార్‌తో చర్చలు జరుపుతున్నారని టాక్. గతంలో ‘వన్ నేనొక్కడినే’ కోసం వీరిద్దరూ కలిసి పనిచేయగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో నిరాశపడ్డారు.

తమ కాంబినేషన్‌పై ఫ్యూచర్‌లో మరో సినిమా చేయాలని భావించినా, క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల కుదరలేదు. కానీ ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుందని తెలుస్తోంది. లాక్‌డౌన్ టైమ్‌లో మహేష్ కోసం సుకుమార్ ఓ కథ రాశారని.. ప్రస్తుతం దానిపైనే చర్చ జరుగుతోందని టాలీవుడ్ టాక్. ఇది గనుక ఓకే అయితే, ప్రజెంట్ ఉన్న కమిట్మెంట్స్ పూర్తి కాగానే ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News