పర్యావరణ సమస్యల పరిష్కారంలో భారత్‌ది కీలకపాత్ర: యూఎస్

న్యూఢిల్లీ: పర్యావరణ సమస్యల పరిష్కారంలో భారత్‌ది కీ రోల్ అని అమెరికా వెల్లడించింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్, విజ్ఞానశాస్త్రం, ఆవిష్కరణల్లో తనదైన ముద్ర వేసుకున్నదని అమెరికా ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది. అందుకే పర్యావరణ సమస్య పరిష్కారంలో భారత్ పాత్ర అత్యంత కీలకమైనదని వివరించింది. అమెరికాకు చెందిన దౌత్య అధికారి జాన్ కెర్రీ ఈ రోజు భారత్ పర్యటించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఏప్రిల్ 5 నుంచి 8వ తేదీ వరకు భారత […]

Update: 2021-04-04 21:41 GMT

న్యూఢిల్లీ: పర్యావరణ సమస్యల పరిష్కారంలో భారత్‌ది కీ రోల్ అని అమెరికా వెల్లడించింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్, విజ్ఞానశాస్త్రం, ఆవిష్కరణల్లో తనదైన ముద్ర వేసుకున్నదని అమెరికా ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది. అందుకే పర్యావరణ సమస్య పరిష్కారంలో భారత్ పాత్ర అత్యంత కీలకమైనదని వివరించింది. అమెరికాకు చెందిన దౌత్య అధికారి జాన్ కెర్రీ ఈ రోజు భారత్ పర్యటించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఏప్రిల్ 5 నుంచి 8వ తేదీ వరకు భారత పర్యటనలో ఉండనున్న జాన్ కెర్రీ భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవడేకర్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లతోనూ భేటీ కానున్నట్టు తెలిసింది. పర్యావరణ మార్పుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కలిసి అడుగేయడంపై ఆయన సంప్రదింపులు జరపనున్నారు. ప్రభుత్వ ప్రతినిధులతోపాటు ప్రైవేటు రంగం, ప్రభుత్యేతర సంస్థలతో చర్చలు జరపనున్నారు. ఈ నెల 22-23వ తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా ఇతర దేశాల అధినేతలతో యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ పర్యావరణ సదస్సును నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News