హంద్వారా అమర జవాన్లకు మహేష్ బాబు నివాళి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పై పోరాడుతున్న సమయంలో తీవ్రవాదులు రెచ్చిపోయారు. దేశం పై విరుచుకుపడ్డారు. జమ్మూకాశ్మీర్ హంద్వారా లో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో జవాన్లు అమరులయ్యారు. వీరిలో కల్నల్, మేజర్, ఇద్దరు జవాన్లు, సబ్ ఇన్ స్పెక్టర్ ఉన్నారు. The Handwara attack – A dark time for our nation. Our soldiers’ courage and determination to safeguard our nation remains unparalleled. I stand in silence […]

Update: 2020-05-04 07:25 GMT

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పై పోరాడుతున్న సమయంలో తీవ్రవాదులు రెచ్చిపోయారు. దేశం పై విరుచుకుపడ్డారు. జమ్మూకాశ్మీర్ హంద్వారా లో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో జవాన్లు అమరులయ్యారు. వీరిలో కల్నల్, మేజర్, ఇద్దరు జవాన్లు, సబ్ ఇన్ స్పెక్టర్ ఉన్నారు.

కాగా హంద్వారా దాడిని దేశానికి చీకటి సమయంగా అభివర్ణించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మన సైనికుల ధైర్యం, దేశాన్ని రక్షించాలనే సంకల్పం అసమానమైనవని కీర్తించారు. దేశ ప్రజల కోసం విధి నిర్వహణలో మరణించిన సైనికులను గౌరవించేందుకు , వారి త్యాగాలను స్మరించుకునేందుకు మౌనంగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. అమర జవాన్ల కుటుంబానికి,వారి మిత్రులు, ఆప్తులకు హృదయపూర్వక సంతాపం ప్రకటించారు మహేష్. ఈ సమయంలో దేవుడు వారికి మరింత శక్తి, బలాన్ని అందించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Tags: Mahesh Babu, Tollywood, Handwara, Attack, Tributes

Tags:    

Similar News