ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

దిశ, హైదరాబాద్ : ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతులు వికారాబాద్ జిల్లా, థరూర్ మండలం దోర్నాల గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్మాస్‌గూడలో నివసించే ఈ కుటుంబాన్ని కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలు సైతం వెంటాడుతున్నట్టు సూసైడ్ నోట్‌‌లో […]

Update: 2020-04-22 11:15 GMT

దిశ, హైదరాబాద్ :
ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతులు వికారాబాద్ జిల్లా, థరూర్ మండలం దోర్నాల గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్మాస్‌గూడలో నివసించే ఈ కుటుంబాన్ని కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలు సైతం వెంటాడుతున్నట్టు సూసైడ్ నోట్‌‌లో పేర్కొనట్టు సమాచారం. ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్న హరీశ్ లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులతో సతమతమైనట్లు ఇరుగుపొరుగువారి నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. మృతులు హరీశ్‌తో పాటు సువర్ణ బాయ్ (తల్లి), గిరీష్, స్వప్నలుగా పోలీసులు గుర్తించారు. అయితే పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Tags: suicide, Meerpet Police, Vikarabad, financial problems

Tags:    

Similar News