die hard fan.. చిరు, పవన్ కోసం సంచలన నిర్ణయం (వీడియో)

దిశ, జగిత్యాల : ఆ అభిమానికి చిరంజీవి ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం దానికి తోడు పవన్ కళ్యాణ్ అంటే మరింత ప్రేమ. దీంతో వారి కుటుంబం ఎల్లవేళలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో చిరు ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్, చిరంజీవీలకు కరోనా వచ్చింది. దీంతో, ఆందోళన పడిన అభిమాని తిరుపతి నుంచి జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి వద్దకు సైకిల్ యాత్ర చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. […]

Update: 2021-08-21 07:24 GMT

దిశ, జగిత్యాల : ఆ అభిమానికి చిరంజీవి ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం దానికి తోడు పవన్ కళ్యాణ్ అంటే మరింత ప్రేమ. దీంతో వారి కుటుంబం ఎల్లవేళలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో చిరు ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్, చిరంజీవీలకు కరోనా వచ్చింది. దీంతో, ఆందోళన పడిన అభిమాని తిరుపతి నుంచి జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి వద్దకు సైకిల్ యాత్ర చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ చిరు ఫ్యామిలీకి వీర అభిమాని. అయితే, చిరు ఫ్యామిలీలో ఇద్దరు అనారోగ్యంతో బాధపడటం వల్ల వారు బాగుండాలని కోరుతూ ఈ నెల పదో తేదిన తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కొండగట్టుకు సైకిల్ మీద బయలుదేరాడు.

సుమారు 1200 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసి శనివారం కొండగట్టుకు చేరుకున్నాడు. చిరు ఫ్యామిలీ అంటే తనకు ఎంతో ఇష్టమని.. వారు ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుతూ సైకిల్ యాత్ర ప్రారంభించానని తెలిపారు. కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకొని, చిరు ఫ్యామిలీ బాగుండాలని స్వామిని మొక్కుకున్నానని తెలిపారు. అభిమానం మనుషులు ఎంత దూరమైనా తీసుకెళ్తుందని వీరాభిమాని ఈశ్వర్ రాయల్‌ను చూస్తే అర్థం అవుతుంది. 

Tags:    

Similar News