దుందుభి వాగులో దూకి మహిళ ఆత్మహత్య..

దుందుభి వాగులో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం గుండ్ల పొట్లపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

Update: 2024-09-07 11:08 GMT

దిశ, రాజాపూర్: దుందుభి వాగులో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం గుండ్ల పొట్లపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెన్నమ్మ (48) చెన్నయ్య భార్య భర్తలు. వీరు బెంగళూరులో ఉంటూ.. వంట పనులు చేసేవారు. ఇటీవల గ్రామానికి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. భర్త రాత్రి తిని నిద్రించగా.. భార్య ఇంటి ముందు నిల్చోని ఫోన్ మాట్లాడుతూ.. తర్వాత దుందుభి నది వద్దకు వెళ్ళింది. అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామంలోని కొందరికి ఫోన్ చేసి తాను దుందుభి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పింది. భర్త, కుటుంబ సభ్యులు రాత్రంతా చెన్నమ్మ కోసం వెతికిన ఆమె ఆచూకీ లభించలేదు. ఆమె నగలు, ఫోన్ నది ఒడ్డున లభించాయని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దుందుభి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News