నిమజ్జనానికి వెళ్లి వ్యక్తి మృతి..

ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు శివారులోని గల పటేల్ చెరువులో సోమవారం ఉదయం వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఓ యువకుడు చెరువులో మునిగి గల్లంతయినట్లు పోలీసులు, స్థానికులు తెలిపారు.

Update: 2024-09-16 16:33 GMT

దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు శివారులోని గల పటేల్ చెరువులో సోమవారం ఉదయం వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఓ యువకుడు చెరువులో మునిగి గల్లంతయినట్లు పోలీసులు, స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం 11వ వార్డు ఎస్సీ కాలానికి చెందిన బుజ్జిగారి రాకేష్ (25) వినాయక నిమజ్జనం కార్యక్రమానికి వెళ్లి నిమజ్జనం అనంతరం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి గల్లంతయ్యాడని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షానికి చెరువులో నీటిమట్టం పూర్తిస్థాయిలో ఉండటంతో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభించకపోవడంతో గజ ఈతగాళ్ల సహాయంతో గంటల తరబడి చెరువులో గాలింపు చేపట్టగా ఎట్టకేలకు మధ్యాహ్నం మృతదేహం లభించిందని, అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Similar News