రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది.

Update: 2024-09-16 14:46 GMT

దిశ, అలంపూర్ టౌన్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఉండవెల్లి శివారులోని 44 నెంబర్ జాతీయ రహదారిపై కర్నూలు వైపు వెళ్తున్న ఉల్లిగడ్డ ట్రాక్టర్ వెనక నుండి మోటార్ సైకిల్ ని ఢీకొంది. దీంతో మోటార్ సైకిల్ పై వెళుతున్న సుభాన్ భాష అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన అబ్దుల్లాను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉండవెల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరూ కర్నూలు కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.


Similar News