పండగ పూట విషాదం.. కాల్వలో పడి ముగ్గురు యువకులు గల్లంతు

శివరాత్రి పర్వదినాన నిజామాబాద్ జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది.

Update: 2024-03-08 08:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: శివరాత్రి పర్వదినాన నిజామాబాద్ జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలో ఎస్సారెస్సీ లక్ష్మీ కాల్వలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకులను సాయినాథ్, లోకేష్, మున్నాలుగా గుర్తించారు. వీరంతా జక్రాన్ పల్లి గన్యతండా వాసులుగా గుర్తించారు. యువకుల కోసం స్థానికులు, అధికారులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 


Similar News