మూడో అంతస్తు నుంచి పడి మహిళ మృతి..

మూడో అంతస్తు బాల్కానీలో మనీ ప్లాంట్ మొక్కను సరి చేస్తూ ప్రమాదవశాత్తు జారి పడ్డ ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.

Update: 2024-10-17 15:59 GMT

దిశ, మీర్ పేట్: మూడో అంతస్తు బాల్కానీలో మనీ ప్లాంట్ మొక్కను సరి చేస్తూ ప్రమాదవశాత్తు జారి పడ్డ ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనం కాలనీ సమీపంలోని బ్లాక్ నెంబర్ 34 లో సింగిరెడ్డి లావణ్య (40) కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. గురువారం మధ్యాహ్న సమయంలో తను నివాసముండే మూడో ఫ్లోర్ బాల్కనీ లో ప్లాస్టిక్ కుర్చీ పై నిలబడి మనీ ప్లాంట్ మొక్కను సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి పడి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.


Similar News