గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద మృతి

గుర్తుతెలియని మహిళా అనుమానాస్పద మృతి చెందినట్లు ఆదిబట్ల పోలీసులు తెలిపారు.

Update: 2024-10-17 13:53 GMT

దిశ, ఇబ్రహీంపట్నం: గుర్తుతెలియని మహిళా అనుమానాస్పద మృతి చెందినట్లు ఆదిబట్ల పోలీసులు తెలిపారు. నాదర్గుల్​లోని పార్వతీపురం సమీపంలో ఉదయం స్థానికులు తిరుగుతున్న క్రమంలో శవం కనిపించడంతో ఈ విషయాన్ని ఆదిబట్ల పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే ఆమె వయస్సు 55 యేండ్లు ఉండవచ్చునని, పింక్​ కలర్​ చీర, పసుపు రంగు బ్లౌజ్​ ధరించి ఉందని వివరించారు. పోలీసులు స్ధానికులను విచారణ చేయగా నాదర్గుల్​ టాటా ఏరోస్పేస్​ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేసినట్లు తెలిపారు. గత 10 రోజుల నుంచి అనారోగ్యంతో, మానసిక పరిస్థితి బాగోలేదని, ఐదు రోజుల క్రితం స్థానిక ఆశ్రమ ఇంచార్జీ గోపీనాయక్​, మరో వ్యక్తి ప్రవీణ్​లు ఇద్దరు ఆమెకు ఆహారం అందించగా ఆమె తిరస్కరించిందని సమాచారం. మృతదేహాన్ని ఓజీహెచ్​ మార్చురీకి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.


Similar News