రోడ్డు ప్రమాదంలో జర్నలిస్ట్ దుర్మరణం...

రోడ్డు ప్రమాదంలో ఓ జర్నలిస్టు మృతి చెందిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Update: 2024-10-17 15:05 GMT

దిశ,కార్వాన్ : రోడ్డు ప్రమాదంలో ఓ జర్నలిస్టు మృతి చెందిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏసీపీ ఫయాజ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎర్ర బోడ ప్రాంతానికి చెందిన రాములు గౌడ్(45) ఓ దినపత్రిక లో సీనియర్ జర్నలిస్ట్. గురువారం సాయంత్రం విధులు నిర్వహించుకొని నార్సింగి నుండి తన బైక్ పై వెళ్తుండగా వెనుక వైపు నుంచి వేగంగా టిప్పర్ ఢీకొట్టింది. సంఘటన స్థలంలోనే రాములు గౌడ్ దుర్మరణం చెందారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోల్కొండ పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.


Similar News