Road Robbery: సినీఫక్కీలో హైవేపై దారి దోపిడీ.. 2 కిలోల బంగారంతో దొంగలు జంప్

సినీఫక్కీలో హైవేపై దొంగలు భారీ దోపిడీకి పాల్పడిన ఘటన కేరళ రాష్ట్రం (Kerala State)లోని త్రిశూల్ (Trishul) వద్ద చోటుచేసుకుంది.

Update: 2024-09-26 08:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినీఫక్కీలో హైవేపై దొంగలు భారీ దోపిడీకి పాల్పడిన ఘటన కేరళ రాష్ట్రం (Kerala State)లోని త్రిశూల్ (Trishul) వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళ ప్రాంతానికి చెందిన బంగారం వ్యాపారి అరుణ్, కోయంబత్తూర్ (Coimbatore) నుంచి బంగారాన్ని కారులో తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అంతకు ముందే రెక్కీ నిర్వహించిన కేటుగాళ్లు అరుణ్‌ కారును త్రిశూల్ ప్రాంతంలో ఛేజ్ చేశారు. అనంతరం దొంగలు కారును అడ్డుపెట్టి వ్యాపారి అరుణ్‌ను కత్తులతో బెదరించి 2 కిలోల బంగారంతో పాటు అతడిని కూడా వెంట తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని వ్యాపారితో పాటు దొంగల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.    


Similar News