Road Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే ఐదుగురు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన అన్నమయ్య జిల్లాల్లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
దిశ, వెబ్డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన అన్నమయ్య జిల్లాల్లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సీఎంఆర్ ట్రావెల్స్కు చెందిన బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. ఈ క్రమంలోనే బస్సు కలకడ మండల కేంద్రం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు తీవ్రంగా గాయపడి స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు స్పాట్కు చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.