ఇంటర్ విద్యార్థిని పెట్రోల్ దాడి ఘటనలో నిందితుడికి రిమాండ్

ఏపీలోని కడప జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-21 16:01 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని కడప జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆదివారం నిందితుడు విఘ్నేశ్ ను పోలీసులు అరెస్ట్ చేయగా.. సోమవారం బద్వేల్ కోర్టులో ప్రవేశ పెట్టారు. నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు కడప సెంట్రల్ జైలుకి నిందితుడిని తరలించారు. కాగా కడప జిల్లాలోని బద్వేల్ లో ఇంటర్ విద్యార్థినిపై విఘ్నేశ్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వారి ఇరువురికి ఇది వరకే పరిచయం ఉందని, ఈ క్రమంలో శనివారం విద్యార్థిని అతన్ని పెళ్లి చేసుకోమని కోరడంతో ఆగ్రహించి.. ఆమెను పొదల్లోకి లాక్కువెళ్ళి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో నిన్న కడప శివారులో నిందితుడిని అరెస్ట్ చేసి, మీడియా ముందు ప్రవేశ పెట్టారు. నేడు కోర్టు నిందితునికి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 


Similar News