మహిళలకు 'దీపం పథకం' ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

Update: 2024-10-21 13:44 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. దీపావళి కానుకగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈనెల 31 నుంచి రాష్ట్రంలో అర్హులైన వారికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 'దీపం పథకం'కు ఆమోదం తెలిపారు. కాగా ఈ పథకానికి ఏడాదికి రూ.2,684 కోట్లు ఖర్చు కానున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించడమే తమ లక్ష్యం అని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు.


Similar News