గుజరాత్ లో బస్సు బోల్తా.. నలుగురు మృతి

గుజరాత్ లో యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి.

Update: 2024-10-07 06:33 GMT

దిశ, వెబ్ డెస్క్: బస్సు బోల్తా పడి నలుగురు ప్రయాణికులు మృతి చెందిన ఘటన గుజరాత్ లో జరిగింది. సుమారు 35 మంది యాత్రికులతో వెళ్తున్న బస్సు బనస్కాంతలో దంత ప్రాంతానికి సమీపంలోని త్రిసూలియా ఘాట్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మరో 25 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తరలించగా.. వైద్యులు చికిత్స చేస్తున్నారు. తీవ్రంగా గాయపడినవారిని పాలన్పూర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబాజీ ఆలయంలో దర్శనానంతరం.. దంత ప్రాంతానికి యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు లోయలో పడకుండా బోల్తా పడి ఆగడంతో.. భారీ నష్టమే తప్పిందన్నారు. లోయలో పడి ఉంటే భారీగా నష్టం వాటిల్లి ఉండేదని, ఇది మరో పెద్దప్రమాదంగా మారేదని తెలిపారు. 


Similar News