తండ్రిని హత్యచేసిన కొడుకుకి జీవిత ఖైదు

తండ్రిని హత్య చేసిన కొడుకుకి జీవిత ఖైదుతో పాటు 5వేల రూపాయల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి నీలిమ మంగళవారం తీర్పునిచ్చారు.

Update: 2024-10-15 15:15 GMT

దిశ, గొల్లపల్లి : తండ్రిని హత్య చేసిన కొడుకుకి జీవిత ఖైదుతో పాటు 5వేల రూపాయల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి నీలిమ మంగళవారం తీర్పునిచ్చారు. మండలంలోని రాపల్లి గ్రామానికి చెందిన గడుగు పోచయ్య తన పేరున ఉన్న రెండు ఎకరాల భూమిని అమ్మే క్రమంలో అతని చిన్న కొడుకు ప్రభుదాస్ తో గొడవలు జరిగాయి. దీంతో భూమి విషయంలో తండ్రిపై పగ పెంచుకున్న ప్రభుదాస్ తన తల్లిని రాళ్లతో గాయపరిచి, తండ్రిని కర్రతో తలపై కొట్టి చంపాడు.

     మృతుని మరదలు సుగుణ ఫిర్యాదు మేరకు గొల్లపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడైన ప్రభుదాస్ ను కోర్టులో హాజరు పరచగా కేసును విచారించిన జిల్లా న్యాయమూర్తి నీలిమ నిందితునికి జీవిత ఖైదుతో పాటు 5వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసులో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.  

Tags:    

Similar News