మూగజీవిని పొట్టన పెట్టుకున్న చిరుత..

వికారాబాద్ జిల్లా యాలాల మండలం రేలగడ్డ తండాలో చిరుత కలకలం సృష్టించింది.

Update: 2024-10-16 04:53 GMT

దిశ, యాలాల : వికారాబాద్ జిల్లా యాలాల మండలం రేలగడ్డ తండాలో చిరుత కలకలం సృష్టించింది. గ్రామస్తులు తెలిసిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి సమయంలో చత్ర్య నాయక్ అనే రైతు రాత్రి సమయంలో పొలం దగ్గర ఎద్దును కట్టేసి ఇంటికి వెళ్ళాడు. చిరుత దూడ పై దాడి చేసి చంపేసిందని అనుమానిస్తున్నారు. చిరుత దాడిలో గ్రామంలో ఒక్కసారి కలకలం రేగింది. చిరుత సంచారంతో ఆ గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత నుంచి కాపాడాలని తాండవాసులు కోరుతున్నారు.


Similar News