ఏసీబీ వలలో కొండాపూర్ పంచాయతీ కార్యదర్శి

నివాస ధ్రువపత్రం కోసం రూ.5 వేలు లంచం తీసుకుంటున్న పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Update: 2024-09-27 14:14 GMT

దిశ, కొండాపూర్ : నివాస ధ్రువపత్రం కోసం రూ.5 వేలు లంచం తీసుకుంటున్న పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం కొండాపూర్ మండల కేంద్రానికి చెందిన మాచేపల్లీ అఫ్సర్ తన ఇంటి ఓనర్ షిప్ సర్టిఫికెట్ అడగగా పంచాయతీ కార్యదర్శి షకీల్ లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీకి సమాచారం అందించి తనకు న్యాయం చేయాలని కోరాడు. దీంతో శుక్రవారం కొండాపూర్ లోని ఎంఈఓ కార్యాలయం వద్ద కార్యదర్శికి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అధికారులు పంచాయతీ కార్యాలయం రికార్డులు తనిఖీ చేశారు. 

Tags:    

Similar News