భార్యను చంపి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త..
హైదరాబాద్ మహా నగరంలో దారుణం చోటు చేసుకుంది. భార్య పై అనుమానంతో భర్త, భార్యను కొట్టి, గొంతు నులిమి చంపి, అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది.

దిశ, జూబ్లీహిల్స్: హైదరాబాద్ మహా నగరంలో దారుణం చోటు చేసుకుంది. భార్య పై అనుమానంతో భర్త, భార్యను కొట్టి, గొంతు నులిమి చంపి, అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... మహబూబ్ నగర్ కి చెందిన పద్మ (48) నరేంద్ర ఇద్దరు దంపతులు, బోరబండ, రాజీవ్ గాంధీ నగర్ సైట్ త్రీలో నివసిస్తుంటారు. నరేంద్ర పాల వ్యాపారం చేస్తుంటాడు. పద్మ- నరేంద్ర దంపతులకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమ్మాయి యూఎస్ లో ఉంటుంది. ఇక, అబ్బాయి త్రిబుల్ ఐటీ ఢిల్లీలో ఉన్నాడు. ఇంట్లో ఇద్దరు ఉండడంతో తరచూ భార్య మీద అనుమానంతో గొడవలు జరిగేవి. అయితే గురువారం తెల్లవారుజామున ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఇక భార్య పద్మ చనిపోయిందని నిర్ధారించుకున్నాక, బోరబండ పోలీస్ స్టేషన్ కి వెళ్లి భర్త నరేంద్ర లొంగిపోయాడు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై బోరాబండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.