Telugu Crime News : ఘోర రోడ్డు ప్రమాదం.. అతివేగమే ప్రాణం తీసింది

కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

Update: 2025-03-15 14:01 GMT
Telugu Crime News : ఘోర రోడ్డు ప్రమాదం.. అతివేగమే ప్రాణం తీసింది
  • whatsapp icon

దిశ, కూకట్​పల్లి : కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో జాతీయ రహదారిపై కిలో మీటర్​ మేర ట్రాఫిక్ స్తంభించింది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళ రాష్ట్రానికి చెందిన ఫిన్ని రాజన్​(39) గత కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి కుత్బుల్లాపూర్​ సర్కిల్​ సుభాష్​నగర్​ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఫిన్ని రాజన్​ చింతల్​ కాకతీయ నగర్​లోని భార్గవ్​ ఎంటర్​ప్రైజెస్​లో సైట్​ ఇంజనీర్​గా పని చేస్తున్నాడు.

    తన స్కూటర్​పై మియాపూర్​ నుంచి కూకట్​పల్లి వైపు వెళ్తుండగా మెట్రో పిల్లర్​ నంబర్​ 681 వద్ద కరాచీ బేకరీకి ఎదురుగా వెనుక నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన లారీ రాజన్​ను ఢీ కొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో జాతీయ రహదారిపై కిలోమీటర్​ మేర ట్రాఫిక్​ జామ్​ అయింది. సమాచారం అందుకున్న కేపీహెచ్​బీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీకి తరలించారు. లారీ డ్రైవర్​ రాహుల్​ కుమార్​ గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే రాహుల్​ కుమార్​ సంఘటనా స్థలం నుంచి పరారైనట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా నిందితుడు ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రం భాల్​పూర గ్రామంగా గుర్తించినట్టు కేపీహెచ్​బీ ఎస్సై మణ్యం తెలిపారు. 


Similar News