గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

మండల పరిధిలోని మమునూరు గ్రామానికి చెందిన గంతాల వెంకటేశ్వరరావు(30) అనే వ్యక్తి మంగళవారం ఉదయం రాజులదేవరపాడు కట్టలేరులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయాడు.

Update: 2024-10-23 14:29 GMT

దిశ, ఎర్రుపాలెం : మండల పరిధిలోని మమునూరు గ్రామానికి చెందిన గంతాల వెంకటేశ్వరరావు(30) అనే వ్యక్తి మంగళవారం ఉదయం రాజులదేవరపాడు కట్టలేరులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయాడు. తండ్రి అప్పారావు ఫిర్యాదు మేరకు ఎస్సై పి.వెంకటేష్ రెస్క్యూ టీంతో కలిసి గాలించగా బుధవారం బనిగండ్లపాడు గ్రామ సమీపంలో కట్టలేరులో మృతదేహాన్ని కనుగొన్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Similar News