నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొన్న బైక్​...తీవ్ర గాయాలై మృతి

నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్​ ఢీ కొట్టడంతో అతను తీవ్ర గాయాలై మృతి చెందాడు.

Update: 2024-10-16 13:45 GMT

దిశ, కథలాపూర్ : నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్​ ఢీ కొట్టడంతో అతను తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన చెట్పల్లి అంజయ్య(56) సిరికొండ బస్టాండ్ సమీపంలో నడుచుకుంటూ రోడ్డు దాటుతున్నాడు.

    ఈ సమయంలో కథలాపూర్ గ్రామానికి చెందిన కమల అనిల్ కుమార్ అనే యువకుడు అజాగ్రత్తగా నడుపుతూ టూ వీలర్ తో అతివేగంగా అంజయ్యను ఢీ కొట్టడంతో తలకు బలమైన గాయాలు అయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుని కుమారుడు చెట్పల్లి హరీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కథలాపూర్ ఎస్సై జి.నవీన్ కుమార్ తెలిపారు. 

Tags:    

Similar News